చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ఖైదీ పరార్

21 May, 2015 18:27 IST|Sakshi
చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ఖైదీ పరార్

హైదరాబాద్ : చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి నర్సింహులు(32) అనే ఖైదీ గురువారం పరారయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్‌నగర్ మండలం రంగంపల్లికి చెందిన నర్సింహులు ఓ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకో ఏడాదిలో శిక్ష పూర్తి అవుతుండగా ఇంతలోనే జైలు నుంచి పరారయ్యాడు. పోలీసులు నర్సింహులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు