పీలేరు సబ్‌జైలులో ఖైదీల ఘర్షణ

25 Oct, 2017 14:20 IST|Sakshi

సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లాలోని పీలేరు సబ్‌జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కాయిన్‌బాక్స్‌ వద‍్ద ఫోన్‌ చేసుకునే విషయమై ఖైదీల మధ్య గొడవ జరిగింది. కలికిరి మండలానికి చెందిన నారాయణరెడ్డి అనే ఖైదీ కాయిన్‌బాక్స్‌ వద్ద ఫోన్‌ మాట్లాడుతుండగా.. ఎంత సేపు మాట్లాడతావంటూ తోటి ఖైదీలు వాదనకు దిగారు. ఈ విషయమై ఖైదీల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. నారాయణరెడ్డిపై తోటి ఖైదీలు దాడికి దిగారు. వెంటనే స్పందించిన జైలు అధికారులు ఖైదీలను వారించి అక్కడి నుంచి పంపివేశారు.

మరిన్ని వార్తలు