ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

10 Jun, 2017 07:00 IST|Sakshi

విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సెంటర్‌లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ట్రావెల్స్‌ బస్సు వెళ్తుండగా ఇబ్రహీంపట్నం సమీపానికి రాగానే అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు