'క్విడ్ ప్రోకో కేసులో కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి'

23 Sep, 2013 11:04 IST|Sakshi

హైదరాబాద్ : క్విడ్ ప్రోకో కేసులో కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి అయ్యిందని సీబీఐ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టుకు తెలియచేశారు. సీబీఐ మెమో ద్వారా ఈ మేరకు కోర్టుకు తెలిపింది. శ్యాం ప్రసాద్ రెడ్డికి సంబంధించిన విషయం మాత్రం తుది నివేదిక ఇవ్వాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. కాగా జగన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి కాగా న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించనుంది. దాంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు