విశాఖపట్నం: జనసేన అధినేత, సినీ నటుడు పవన్కల్యాణ్పై సినీ నిర్మాత నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్కల్యాణ్ మాటలు వింటుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని నిర్మాత నట్టికుమార్ వ్యాఖ్యాలు చేశారు.
'నేను పవన్ అభిమానినే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన మీద అభిమానం పోయింది' అని నట్టికుమార్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ నిలబడ్డానికి వైఎస్ రాజశేఖరెడ్డి కారణమని ఆయన అన్నారు. మహోన్నతమైన వ్యక్తిపై పవన్ మాటలు సరికాదని నట్టి సూచించారు.
హెలికాఫ్టర్లో వచ్చి మాట్లాడటం కాదు, ఒక రోజు పాదయాత్ర చేయి చూద్దామని నట్టికుమార్ సవాల్ విసిరారు. మీ సినిమాల కోసం ఉరివేసుకున్న వారిని ఎన్నడైనా పరామర్శించావా అని పవన్ ను నట్టి ప్రశ్నించారు.
సినిమాలో కోట్లు నష్టపోయిన వారిని చూడలేనివాడివి, 9కోట్ల ప్రజలను ఎలా చూస్తావని నట్టి కుమార్ నిలదీశారు. తాట తీస్తా..అన్న మాటలు నీ హుందాతనానికి సరికాదు. ఎవరు తాట తీస్తారో 16న తేలుతుంది అని నట్టి స్పందించారు.
కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద. ఎంత మందికి సహాయం చేశావో చెప్పాలని.. తాను బహిరంగ చర్చకు నేను రెడీ అని నట్టికుమార్ అన్నారు.