గుంటూరు మార్కెట్ యార్డులో లావాదేవీలు బంద్

14 Jun, 2016 18:26 IST|Sakshi

గుంటూరు: గుంటూరు మార్కెట్ యార్డులో దిగుమతి, ఎగుమతి గుమాస్తాలు, హమాలీలు వ్యాపార లావాదేవీలను నిలిపివేసి పరిపాలన కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. యార్డు అధికారుల నిబంధనలతో తమకు పనిభారం పెరిగిపోతోందని, నిబంధనలు సడలించాలని వారు కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు యార్డులో లావాదేవీలు జరపబోమంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకొన్న నల్లపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు సిబ్బందితో మిర్చి యార్డు వద్దకు చేరుకొని పూర్తి బందోబస్తు ఏర్పాటుచేశారు.
 

మరిన్ని వార్తలు