రాజమండ్రిలో భక్తుల కిటకిట

19 Jul, 2015 15:53 IST|Sakshi
రాజమండ్రిలో భక్తుల కిటకిట

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కరఘాట్ల వద్ద భక్తుల రద్దీ అలాగే కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో వేలాది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. నిన్నటితో పోల్చిచూస్తే ఈ రోజు కోటిలింగాల ఘాట్ లో భక్తుల రద్దీ కొంచెం తక్కువగా కనిపించింది. వారాంతం కావడంతో భక్తులు తమ కుటుంబసభ్యులతో కలిసి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చారు. అయితే రాజమండ్రి ప్రధాన బస్ స్టాప్ వద్దకు కాకుండా నేరుగా పుష్కర ఘాట్లకు వెళ్లాలని భక్తులను అధికారులు కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజమండ్రిలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మరిన్ని వార్తలు