తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. స్వామి దర్శనానికి భక్తులు ఆరు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి ఆరు గంటలు, నడక దారిన వెళ్లే భక్తులకు నాలుగు సమయం పడుతుంది. కాగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పది కంపార్ట్మెంట్లు నిండాయి. కాగా నేడు స్వామివారికి పుష్పయాగం కారణంగా ఆర్జిత సేవలన్నిటీనీ టీటీడీ రద్దు చేసింది. స్వామివారికి గురువారం ప్రత్యేక సేవ- తిరుప్పావై.