పీవీ రంగారావు కన్నుమూత

1 Aug, 2013 13:26 IST|Sakshi
పీవీ రంగారావు కన్నుమూత

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పెద్ద కుమారుడు పీవీ రంగారావు (75) గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున మరణించారు.  హైదరాబాద్‌ హిమయత్‌నగర్‌లోని స్వగృహంలో రాత్రి 2.30 కి ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న సాయంత్రమే ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడినట్లు సమాచారం. అవివాహితుడైన రంగారావుకు 75 ఏళ్లు. 1989 నుంచి 94 వరకు విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు.  మధ్యాహ్నం బన్సీలాల్‌ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి. పీవీ రంగారావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

మరిన్ని వార్తలు