శ్రీవారి సేవలో ప్రముఖులు

10 Jul, 2016 12:34 IST|Sakshi

తిరుమల : కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఇండియన్ క్రికెటర్ దినేష్ కార్తీక్, రైల్వే డీఐజీ ఈశ్వర్రావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.


మరిన్ని వార్తలు