'ఆరోపణలు పచ్చి అబద్ధాలు...రుజువు చేయండి'

18 Oct, 2013 14:01 IST|Sakshi

హైదరాబాద్ : రాష్ట్రంలో వామపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు...సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు లేఖ రాశారు. నారాయణ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమపై చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని...వాటిని బహిరంగంగా రుజువు చేయాలని డిమాండ్ చేశారు. వామపక్షాల ఐక్యత గురించి చెబితే... ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావటం లేదని రాఘవులు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు