'కాంగ్రెస్ మద్దతిస్తుంది'

11 Dec, 2015 18:46 IST|Sakshi

రాజమండ్రి రూరల్ : కాపులను బీసీల్లో చేర్చే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జాప్యం వహిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి అనంతరం పార్లమెంట్కు పంపిస్తే.. రాజ్యసభలో మెజార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పక మద్దతు ఇస్తోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. శుక్రవారం రాజమండ్రిలో జరిగిన బలిజ, తెలగ, వంటరి కాపు ప్రతినిధుల రాష్ట్ర సదస్సులో పాల్గొన్న ఆయన కాపుల పట్ల తెలుగుదేశం వైఖరిని తప్పుపట్టారు.

మరిన్ని వార్తలు