సాక్షి, హైదరాబాద్: విజయవాడ రైల్వే ఎస్పీ శ్యాంప్రసాద్ సస్పెన్షన్ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తప్పుబట్టింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు క్యాట్ సభ్యులు బీవీ రావు, రంజనాచౌదరి లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. రైల్వేక్వార్టర్లో ఉంటూ ఇంటి అద్దెను పొందారన్న కారణంగా శ్యాంప్రసాద్పై క్రిమినల్ కేసు నమోదు చేయడం తప్పని పేర్కొంది.
‘‘బదిలీని సవాల్ చేస్తూ క్యాట్ను ఆశ్రయించాడన్న కారణంగానే.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు, వెంటనే కోర్టు విచారణ (ప్రాసిక్యూషన్)కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయన తప్పు చేశాడని భావిస్తే ఇంటి అద్దెను రికవరీ చేసుకోవచ్చు. అయినా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి ఇది తగదు’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. క్యాట్తీర్పు నేపథ్యంలో శ్యాంప్రసాద్ రైల్వే ఎస్పీగా కొనసాగనున్నారు.
కేసు పూర్వాపరాలివీ..
విజయవాడ రైల్వే ఎస్పీగా ఉన్న శ్యాం ప్రసాద్ను వెంటనే హైదరాబాద్లో రిపోర్టు చేయాలంటూ ఏపీ డీజీపీ ఆఫీసు నుంచి జూలైలో రాతపూర్వక ఉత్తర్వులు వెళ్లాయి. మూడేళ్లు పూర్తికా కుండానే బదిలీ చేయడం అన్యాయ మంటూ ఆయన క్యాట్ను ఆశ్రయిం చాగా.. బదిలీ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రైల్వే క్వార్టర్లో ఉంటూ హెచ్ఆర్ఏ పొందుతున్నారని శ్యాం ప్రసాద్పై క్రిమినల్ కేసు నమోదు, సస్పెన్షన్కు ప్రభుత్వం ఆదేశించింది.