రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు

22 Jul, 2015 14:51 IST|Sakshi

విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్రా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. అలాగే ఒడిశా పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

మరిన్ని వార్తలు