ఏపీకి వర్షసూచన

5 Oct, 2015 10:50 IST|Sakshi

విశాఖపట్నం: వచ్చే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్రమీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరిస్తుందని వాతావరణశాఖ కేంద్రం అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు