మోదీ లేకుంటే చంద్రబాబు జీరో: సోము వీర్రాజు

18 Jan, 2019 15:45 IST|Sakshi

కడప నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాం: సోము

సాక్షి, వైఎస్సార్‌: రానున్న ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్రజలే బుద్ధిచెబుతారని బీజేపీ నేత, మండలి సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబును ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమైయారని, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం విమర్శించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల ప్రచారాన్ని  కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ త్వరలోనే కడప నుంచి ప్రారంభిస్తారని వెల్లడించారు.

నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు రూ.ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని వీర్రాజు ఆరోపించారు. పేదలకు ఇళ్లు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదన్నారు. చంద్రబాబు అవినీతికి హద్దులు లేవని తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ అభివృద్ధిలో మోదీ సహాయం లేకపోతే చంద్రబాబు జీరో అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు