'చంద్రబాబును నిలదీయండి'

7 Mar, 2015 21:55 IST|Sakshi

నెల్లూరు(కావలి): ఇష్టానుసారం హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలను మరిచిన ఏపీ సీఎం చంద్రబాబును, మహిళలు, రైతులు నిలదీయలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నింటిని మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వాగ్దానం చేసి సీఎం అయ్యాక హామీల అమలు అట్టకెక్కించారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో సన్మానం చేయించుకునేందుకు వస్తున్న చంద్రబాబును మహిళలు నిలదీయాలన్నారు.

మరిన్ని వార్తలు