రంగరాజన్‌కు నేడు ‘గీతం అవార్డు’

9 Aug, 2014 00:46 IST|Sakshi

విశాఖపట్నం: ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త, రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్, మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ప్రస్తుత చైర్మన్ డాక్టర్ చక్రవర్తి రంగరాజన్(82)ను శనివారం గీతం విశ్వవిద్యాలయం ఫౌండేషన్ అవార్డుతో ఘనంగా సత్కరించనుంది. ఈ మేరకు వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి. సుబ్రహ్మణ్యం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

విశాఖపట్నంలో జరిగే వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో డాక్టర్ రంగరాజన్‌ను సత్కరించనున్నట్టు పేర్కొన్నారు. అవార్డు కింద రూ.10 నగదును అందజేయనున్నట్టు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు