ఇద్దరు బాలికలపై అత్యాచారం!

17 Mar, 2015 22:04 IST|Sakshi

గుంటూరు: పిట్టవానిపాలెం మండలం కాజీపాలెం శివారులో ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగింది. చల్లపల్లి ప్రభుదాస్ అనే వ్యక్తి ఈ ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసి పరారయ్యాడు. బాలికలలో ఒకరికి ఏడు సంవత్సరాలు, మరొకరికి ఎనిమిది సంవత్సరాలు. నిందితుడు ప్రభుదాస్ ఆ బాలికలకు తాత వరస అవుతాడు.  బాధితుల బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు బాలికలను వైద్యపరీక్షల నిమిత్తం బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 నిందితుడు ప్రభుదాస్ను స్థానికులు పట్టుకోవడంతో అతను వారి నుంచి తప్పించుకొని  ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు అతనిని తప్పించారు. ఆ తరువాత అతను పారిపోయాడు. అతని కోసం పోలీసులు

గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు