విజయనగరం: రెల్లి కులస్థులకోసం ప్రత్యేక కార్పోరేషన్ను ఏర్పాటు చేయాలని పార్వతీపురానికి చెందిన రెల్లికులస్తులు జననేత జగన్మోహన్రెడ్డిని వేడుకున్నారు. తమ కులాన్ని పేదరికం వేధిస్తోందనీ, చదువుకునే స్థోమత లేక అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉంటోందనీ చెప్పారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే సబ్సిడీ రుణాలు తీసుకుని జీవనోపాధి పొందుతామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్ని సార్లు వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందనీ, వైఎస్ పాలనలో రెల్లి కులస్తులకు నామినేటెడ్ పదవులిచ్చి గౌరవించారనీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే తమకు న్యాయం చేయాలని కోరారు.