మైలవరంలో అక్రమ రేషన్

11 Mar, 2016 09:44 IST|Sakshi
మైలవరం : కృష్ణా జిల్లా మైలవరం మండలం తుళ్లూరులోని ఏఎంసీ చెక్‌పోస్టు వద్ద 17 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఏపీ37 డబ్ల్యు0699 అనే నెంబర్ గల లారీలో ఖమ్మం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు రేషన్ ను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు