6 బస్తాల రేషన్‌బియ్యం పట్టివేత

8 Aug, 2015 12:10 IST|Sakshi

పాణ్యం(కర్నూలు): కర్నూలు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్థులు పట్టుకొని తహశీల్దార్‌కు అప్పగించారు. జిల్లా లోని పాణ్యం మండల పరిధిలోని గగ్గటూరు గ్రామంలో శనివారం ఆరు బస్తాల రేషన్ బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా.. గుర్తించిన గ్రామస్థులు ఆటోను ఆపి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్థులు తహశీల్దార్‌కు సమాయారం అందించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు