సిఫారసులు, పైరవీలతో బదిలీలకు బ్రేక్

16 Sep, 2015 15:48 IST|Sakshi

నెల్లూరు కలెక్టరేట్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వీఆర్వోలు, ఆర్‌ఐలు, డీటీల బదిలీల కౌన్సెలింగ్ 15వ తేదీ అర్థరాత్రికే పూర్తి కావాల్సి ఉంది. అయితే, ఒక్కో అధికారి నాలుగైదు సిఫారసు లేఖలు తీసుకుని వస్తున్నారు. దీంతోపాటు తమకు ఫలానా అధికారే కావాలంటూ టీడీపీ నేతలు కొర్రీలు పెడుతున్నారు. ఈ కారణంగా కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం వరకు సాగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇంకా 300 వీఆర్వోలు, 18 ఆర్‌ఐలకు కౌన్సెలింగ్ చేయాల్సి ఉంది.

మరిన్ని వార్తలు