'ఆ ఎంపీ బ్యాంకు రుణాలను రికవరీ చేయాలి'

1 Jul, 2015 17:15 IST|Sakshi
'ఆ ఎంపీ బ్యాంకు రుణాలను రికవరీ చేయాలి'

విశాఖపట్నం: అరకు ఎంపీ కొత్తపల్లి గీత బ్యాంకుకు రుణపడిన మొత్తాన్ని ఆమె నుంచి రికవరీ చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ అన్నారు. పట్టణంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ గీతను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమెను పదవీ నుంచి తొలగించాలని పేర్కొన్నారు.

నామినేషన్, కులధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే ఈశ్వరీ కోరారు. కొత్తపల్లి గీత బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించలేదని ఆరోపణలు వచ్చిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు