8,422 మంది రికవరీ

6 Jul, 2020 04:17 IST|Sakshi

ఆదివారం 961 పాజిటివ్‌ కేసులు.. 

గుంటూరు జిల్లాలో అత్యధికం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారినపడ్డ వారిలో 8,422 మంది రికవరీ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో 18,697 మందికి కరోనా సోకగా 10,043 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ 232 మంది మృతి చెందారు.

ఆదివారం ఒక్కరోజే 961 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 157 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 14 మంది మృతి చెందారు. కర్నూలులో ఐదుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరు, కడపలో ఇద్దరు చొప్పున, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.  

మరిన్ని వార్తలు