250 కిలోల ఎర్రచందనం సీజ్‌,15 మంది అరెస్ట్

20 Dec, 2017 13:27 IST|Sakshi

సాక్షి, కడప : వైఎస్సార్‌ జిల్లా సుండుపల్లి శేషాచల అడవుల్లో తరలించేందుకు సిద‍్ధంగా ఉంచిన 250 కిలోల ఎర్రచందనం దుంగలను పోలీసులు బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర‍్భంగా 15 మంది స‍్మగ‍్లర‍్లను అరెస్టుచేశారు. పట్టుకున‍్న ఎర్రచందనం విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని వారు చెప్పారు. స‍్మగ‍్లర‍్ల నుంచి 8 మొబైల్‌ ఫోన‍్లు, రూ.30 వేల నగదు, ఒక టెంపో వాహనాన్ని స్వాధీనం చేసుకున‍్నట్లు కడప డీఎస్పీ మాసూమ్‌బాషా తెలిపారు.

మరిన్ని వార్తలు