ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌

8 Jun, 2017 17:10 IST|Sakshi
ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌

చిత్తూరు : ఎర్రచందనం స్మగ్లర్లకు జిల్లాలో మరో ఎదరుదెబ్బ తగిలింది. మదనపల్లె సబ్‌ డివిజన్‌ పరిధిలో పీలేరు, సత్యవేడు పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సహాయంతో రెండు ఎర్రచందనం స్మగ్లింగ్‌ గ్యాంగుల్లో ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 6 వాహనాలు( 1 లారీ, 1 కారు, 4 మోటారు సైకిళ్లు), సుమారు 1.5 టన్నుల బరువైన 48 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అబ్దుల్‌ రహమాన్‌ అనే అంతర్జాతీయ స్మగ్లర్‌ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ జి. శ్రీనివాస్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

మరిన్ని వార్తలు