భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం

13 Jul, 2015 13:42 IST|Sakshi

రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం డంప్ బయటపడింది. అటవీశాఖ అధికారులు సోమవారం గాదెల-వైకోట సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతుండగా డంప్ వెలుగు చూసింది. 75 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.60 నుంచి రూ.80 లక్షలు ఉంటుందని అధికారులు  అంచనా వేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు