చిత్తూరు జిల్లాలో పోలీసుల కూంబింగ్‌

15 Dec, 2017 11:49 IST|Sakshi

సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. శ్రీవారి మెట్టు సమీపంలో శుక్రవారం పోలీసులు కూంబింగ్‌​ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. పోలీసులను చూసి ఎర్రచందనం దుంగలను వదిలేసి కూలీలు పరారయ్యారు. ఘటనాస్థలంలో 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు