పేలిన రెడ్‌మీ నోట్‌–4 సెల్‌ఫోన్‌

15 Jun, 2019 12:18 IST|Sakshi

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంలో చార్జింగ్‌ పెట్టిన సెల్‌ఫోన్‌ పేలిపోయింది. రామ్‌నగర్‌ కాలనీకి చెందిన సూర్యచంద్ర ఏడాదిగా రెడ్‌మీ నోట్‌–4 ఫోన్‌ వాడుతున్నాడు. శుక్రవారం ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టి ఇంటి బయట ఉన్నాడు. ఉన్నట్టుంది శబ్దం రావడంతో లోపలికి వెళ్లి చూడగా ఫోన్‌ పేలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు