రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

29 Jan, 2016 06:27 IST|Sakshi

తిరుపతి: చంద్రగిరి మండలం రంగపేట వద్ద టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహించింది. టాస్క్ ఫోర్స్ కు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. దీంతో సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపగా కూలీలు పారిపోయారు. ఆ ప్రాంతంలో పోలీసులు రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఐజీ కాంతారావు పరిశీలించారు.
 

మరిన్ని వార్తలు