జియో సిమ్‌కు పూజలు

29 Mar, 2017 21:30 IST|Sakshi
జియో సిమ్‌కు పూజలు
భట్టిప్రోలు: రిలయన్స్‌ జియో సిమ్‌ ఆఫర్‌ గడువు నేటితో ముగియనుండటంతో వినియోగదారులు ఆఫర్‌ గడువును పొడిగించాలని కోరుతూ జియో సిమ్‌కు పూజలు నిర్వహించారు. ఆరు నెలల కిందట ప్రారంభమైన జియో సిమ్‌ సేవలు వినియోగదారులు ఉచితంగా అందుకున్నారు. ఈ నేపథ్యంలో  ఉగాది పర్వ దినాన గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన వినియోగదారుడు మాచర్ల వీరేంద్ర జియో సిమ్‌కు పండ్లు, పూలు పెట్టి పూజలు నిర్వహించాడు.
 
>
మరిన్ని వార్తలు