రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం

21 Mar, 2016 19:43 IST|Sakshi

తెనాలి రూరల్ (గుంటూరు జిల్లా) : ఓ హత్య కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న ఖైదీ అధిక మోతాదులో ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి సబ్ జైలులో సోమవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. నందులపేటకు చెందిన వృద్ధుడి హత్యకేసులో పట్టణ ఐతానగర్‌కు చెందిన వల్లభాపురం రాజేష్ నిందితుడు. 41 రోజులు నుంచి సబ్‌జైల్‌లో రిమాండ్‌లో ఉన్నాడు.

ఇటీవల అనారోగ్యానికి గురికావటంతో వైద్య సేవలు పొందిన రాజేష్, ఆ సమయంలో వైద్యులు ఇచ్చిన ట్యాబ్లెట్లు తన వద్దే ఉంచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతని బెయిల్ విషయంలో కుటుంబసభ్యులు సహకరించకపోవటంతో విరక్తి చెంది అధిక మోతాదులో ట్యాబ్లెట్లు మింగినట్లు తెలిసింది. విషయం గమనించిన జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం రాజేష్‌ను తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

మరిన్ని వార్తలు