ఏపీ సచివాలయంలో గణతంత్ర వేడుకలు

26 Jan, 2020 08:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం ఉదయం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, చీఫ్‌ సెక్యూరిటీ అధికారి కేకే మూర్తి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇక తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, సీఎం కార్యాలయ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి, సీఎస్‌వోలు జోషి, పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు
అసెంబ్లీలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, చీఫ్‌ మార్షల్‌, అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే శాసనమండలిలో ఛైర్మన్‌ షరీఫ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.


మరిన్ని వార్తలు