శ్రీకాకుళం అర్బన్: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన యాదవ కులస్తుల సంక్షేమం, అభివృద్ధి కోసం యాదవ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని యాదవ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతి ఇచ్చారు. ఆమదాలవలస నియోజకవర్గం వంజంగి వద్ద ఏర్పా టు చేసిన శిబిరం వద్ద జగన్మోహన్రెడ్డిని బాలకృష్ణ కలసి వినతి ఇచ్చా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ కులస్తులనే కార్పొరేషన్ చైర్మన్గా నియమించాలని, యాదవులకు చెందిన చనిపోయిన జీవాలకు బీమా కల్పించాలని, ఎవరైనా వైపరీత్యాల వల్ల చనిపోతే బీమా సదుపాయం కల్పించాలని, బీసీ–డి కేటగిరి నుంచి బీసీ–ఎ కేటగిరి లోకి మార్చాలని, రాజకీయ అవకాశం కల్పించాలని ఆయన కోరారు.