రెండు లక్షల కోసం రిటైర్డ్ ఉద్యోగి కిడ్నాప్!

20 Sep, 2014 14:23 IST|Sakshi

విశాఖ ఎయిర్ పోర్ట్ జోన్ పరిధిలో రెండు లక్షల రూపాయలు బాకీ ఉన్నాడని ఓ వ్యక్తిని కొంతమంది కలిసి కిడ్నాప్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావును కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆయనను నగరంలోని ఓ హోటల్లో బంధించారు. అనంతరం హైదరాబాద్లో ఉన్న నాగేశ్వరరావు కుమార్తెకు వారు ఫోన్ చేసి, తమకు రెండు లక్షల రూపాయలు ఇస్తేనే ఆయనను విడుదల చేస్తామని బెదిరించారు.

అయితే, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు ఫోన్ కాల్ ఆధారంగా దుండగుల ఆచూకీ కనుగొన్నారు. వెంటనే అక్కడ సోదా చేసి, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు