గుంటూరు : గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయం ఎదుట సోమవారం వీఆర్ఓ, వీఆర్ఏ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రెవెన్యూ ఉద్యోగులపై దాడికి దిగిన టీడీపీ రియల్టర్లపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడుతున్న రియల్టర్లను అడ్డుకున్నందుకు అసభ్య పదజాలంతో దుర్భాషలాడి, రెవెన్యూ ఉద్యోగుల చొక్కాలు ఊడదీయించిన సంగతి తెల్సిందే.