కాన్బెర్రా : ఆస్ట్రేలియాలో భారత హై కమిషనర్ ఏఎమ్ గొండనేతో ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా గురువారం సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోజా నేడు గొండనేతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి అవకాశాల గురించి చర్చించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి రోజా వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గొండనే మెచ్చుకున్నారు.