సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న రోజా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు రోజాకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.