వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

31 May, 2017 08:24 IST|Sakshi
వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఐదుగురు తెలంగాణ వాసుల దుర్మరణం
మృతుల్లో ముగ్గురు చిన్నారులు


కడప: వైఎస్సార్‌ కడప జిల్లా దువ్వూరు మండలం ఖానగూడూరు వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తున్న వారి వాహనం ప్రమాదానికి గురైన ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఒకే కుంటుంబం వారు తిరుమల వెళ్లి శ్రీవారి దర్శన అనంతరం మినీబస్సులో తిరిగి వస్తుండగా.. ఖానగూడురు వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 8 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను కర్నూలు జిల్లా చాగలమర్రి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది ఉన్నట్లు సమాచారం డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు