ఎడ్లబండిని ఢీకొన్న లారీ: ఒకరి మృతి

9 Mar, 2015 11:18 IST|Sakshi

కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి ప్రధాన రహదారిపై వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బండిలో ఉన్న రైతు నరసింహలు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు రెండు ఎద్దులు మృతిచెందాయి. నరసింహులు స్వగ్రామం కోస్గి మండలం పల్లెపాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
(మంత్రాలయం)

మరిన్ని వార్తలు