వ్యాన్ బోల్తా..ఒకరి మృతి

2 May, 2015 11:23 IST|Sakshi

కర్నూలు : కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై పెట్రోల్ బంకు వద్ద వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్ వెనక, ముందు టైర్లు ఒకేసారి పంక్చర్ కావడం వల్లే బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ క్లీనర్ ఉపేంద్ర(40) అక్కడిక్కడే మరణించాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉపేంద్ర స్వగ్రామం నల్గొండ జిల్లా తిరుమలగిరి. క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(వెల్దుర్తి)
 

మరిన్ని వార్తలు