నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

2 Jun, 2018 11:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నెల్లూరు : జిల్లాలోని ముసునూరు జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి విజయవాడకి వెళ్తున్నన్న సమయంలో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ మృతిచెందగా, పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానకి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు