రోడ్మ్యాప్ అనవసరం: ఎమ్మెల్యే ఆనం

8 Jul, 2013 19:42 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణపై అధిష్టానం రోడ్మ్యాప్ అనవసరం అని  ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. రాజీనామాల పేరిట కొందరు నేతలు హైడ్రామా ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలం వ్యతిరేకం అని చెప్పారు. మద్రాస్ టు కర్నూలు, కర్నూలు టు హైదరాబాద్కు రాజధాని సహా తామూ మారాం అని, ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే రాయల తెలంగాణ, ఉత్తరాంధ్ర, నెల్లూరు కూడా ఒక రాష్ట్రం కావాలనే డిమాండ్లు తలెత్తుతాయన్నారు.

హైదరాబాద్, తెలంగాణలో రాష్ట్ర విభజనపై రెఫరెండం నిర్వహించాలని ఆయన కోరారు. రెఫరెండానికి తాము కట్టుబడి ఉంటామని వివేకానందరెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు