భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సోమవారం అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. పది కాసుల బంగారం, వెండి, ఇత్తడి బిందెలు, రూ. లక్ష నగదును చోరీ చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.