రాగి దొంగల ముఠా అరెస్ట్

7 Aug, 2015 15:31 IST|Sakshi

ప్రకాశం(ఎర్రగొండపాలెం): విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగిని దొంగిలించి సొమ్ము చేసుకునే ముఠాను పుల్లల చెరువు మండల కేంద్రంలో పట్టుకున్నారు. జిల్లాలో ఈ మధ్య కాలంలో ట్రాన్స్ ఫార్మర్‌లకు సంబంధించిన రాగి దొంగిలిస్తున్నారని చెప్పి 64 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్పమత్తమైన పోలీసులు రాగి దొంగతనాలపై నిఘా పెంచారు.

ఈ నేపథ్యంలోనే పుల్లల చెరువులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. ట్రాన్స్‌ఫార్మర్‌ల నుంచి రాగి దొంగిలించేది మేమే అని నిందితులు ఒప్పుకున్నారు. ఈ ముఠా నాయకుడు షేక్ సుభానీ పరారీలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు