విశాఖపట్నం: విశాఖ జల్లాలో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 54 గ్రాముల బంగారం, 7 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పట్టుబడిన నిందితుల్లో బమ్మిడి సంతోష్(29), కిల్లి వెంకటేశ్(28)లపై విశాఖపట్నం, విజయనగరంలోని పలు పోలీస్స్టేషన్లలో ఇదివరకే కేసులు కూడా ఉన్నాయి.