తాడేపల్లిగూడెంలో దోపిడీ దొంగల బీభత్సం

13 May, 2015 00:23 IST|Sakshi

తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో మంగళవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు దొంగతనం చేసేందుకు యత్నించారు.

అంతలో స్థానికులు రావడాన్ని గమనించి వారివెంట తెచ్చుకున్న రివాల్వర్ ను దుండగులు అక్కడే వదిలి పరారైనట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు