-

తాళాలు బద్దలుకొట్టి భారీగా సొత్తు చోరీ

1 May, 2016 09:52 IST|Sakshi

గుత్తి : అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగలు అదను చూసుకుని ఓ ఇంట్లో భారీగా సొత్తును చోరీ చేశారు. జెండా వీధిలో ధనుంజయ్ అనే వ్యక్తి, తన భార్యతో కలసి ఇంటికి తాళం వేసి శనివారం రాత్రి డాబాపై నిద్రించారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు అర్ధరాత్రి ఇంటి తాళం పగులగొట్టుకుని లోపలికి ప్రవేశించారు.

25 తులాల బంగారు ఆభరణాలు, రూ.20వేల నగదు ఎత్తుకుపోయారు.ఆదివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు