పద్మావతి, చెన్నై ఎక్స్ప్రెస్ల్లో దొంగల బీభత్సం

30 May, 2014 08:24 IST|Sakshi
పద్మావతి, చెన్నై ఎక్స్ప్రెస్ల్లో దొంగల బీభత్సం

అనంతపురం :  తిరుపతి - సికింద్రాబాద్‌ మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. రైలు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోకి రాగానే  దుండగులు చైను లాగి దోపిడీ చేశారు. ఎస్-6,7,8,9 బోగీల్లో ప్రయాణికుల నుంచి  నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు.

 

ఇక చెన్నై-సికింద్రాబాద్ మధ్య నడిచే చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోనూ దొంగలు మరోసారి దోపిడీ తెగబడ్డారు. గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలో ఓ మహిళ నుంచి దుండగులు బంగారం అపహరించి పరారయ్యారు. వారం వ్యవధిలో చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు మూడుసార్లు దోపీడీకి పాల్పడ్డారు.  ప్రయాణికుల భద్రతలో వైఫల్యం చెందుతున్న రైల్వే సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు